దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 87 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,31,498 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 383 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,45,768 కి పెరిగింది. ప్రస్తుతం 3,01,989 (0.90%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మార్చి 2020 తర్వాత దేశంలో యాక్టివ్ కేసులలో ఇదే అత్యల్పం.
గత 24 గంటల్లో కేరళ (15,768), మహారాష్ట్ర (3,131), మిజోరాం (1,731), తమిళనాడు (1,647), ఆంధ్రప్రదేశ్ (1,179), కర్ణాటక (818), వెస్ట్ బెంగాల్ (537), ఒడిశా (462), అస్సాం (441), హిమాచల్ ప్రదేశ్ (263) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 34,167 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,27,83,741 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.77 శాతంగానూ, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ