ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ – ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP To be Held Public Meeting in Vijayawada on 21st Against Govt Policies Says State President Somu Veerraju, BJP To be Held Public Meeting in Vijayawada on 21st Against Govt Policies, BJP Public Meeting in Vijayawada, Vijayawada BJP Public Meeting, BJP Public Meeting, AP BJP State President Somu Veerraju, Somu Veerraju, BJP Public Meeting News, BJP Public Meeting Latest News And Updates, BJP Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఈనెల 21 విజయవాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దీనిని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపిన ఆయన కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు సొంతపేర్లు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు సంక్షేమ పథకాల పేరిట కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని వీర్రాజు మండిపడ్డారు.

రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయిందని, అలాగే నేచుర్ క్యూర్ ఆస్పత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులిచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని వినియోగించుకోలేక పోయిందని, చివరకు రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారని వ్యాఖ్యానించినారు. ఈ వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని సోము వీర్రాజు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =