దేశంలో సెప్టెంబర్ 7, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,613 కు, మరణాల సంఖ్య 71,642 కు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 32,50,429 కు చేరుకోగా, ప్రస్తుతం 8,82,542 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నమోదైన మొత్తం కేసులలో 60% కేసులు 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర 21.6% కేసులతో ముందుండగా, ఆ తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 11.8%, తమిళనాడు 11.0%, కర్నాటక 9.5%, ఉత్తర ప్రదేశ్ 6.3% కేసులతో కొనసాగుతున్నాయి. అలాగే దేశంలో ఉన్న యాక్టీవ్ కేసులలో ఈ 5 రాష్ట్రాలే 62% వాటా కలిగివున్నాయి. మహారాష్ట 26.76% యాక్టీవ్ కేసులతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 11.30%, కర్నాటక 11.25%, ఉత్తరప్రదేశ్ 6.98%, తమిళనాడులో 5.83% యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో కూడా ఈ ఐదు రాష్ట్రాలే 70% వాటాను కలిగివున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu