తెలంగాణ రాష్ట్రంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వందశాతం అపాయింట్మెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా కోవిడ్ పరిస్థితులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని జనవరి 18, 2022 నుండి రోజువారీ విడుదల చేసే అపాయింట్మెంట్స్ సంఖ్య 50 శాతంకి తగ్గించబడిందని, అనంతరం జనవరి 28 నుండి 30%కి తగ్గించబడ్డాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా అపాయింట్మెంట్ల లభ్యతలో 30 రోజుల వరకు సాగిన జాప్యం పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందన్నారు.
అపాయింట్మెంట్స్ లభ్యతలో సుదీర్ఘ జాప్యం మరియు పాస్పోర్ట్ దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, మంత్రిత్వ శాఖ ఆమోదంతో అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల వద్ద 100 శాతం అపాయింట్మెంట్స్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్లోని బేగంపేట్, అమీర్పేట్, టోలీచౌకి మరియు నిజామాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో, కరీంనగర్ లోని పాస్పోర్ట్ సేవా లఘు కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 పోస్టాఫీసు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో 100 శాతం అపాయింట్మెంట్స్ ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారాల్లో మరియు మార్చి నెలలో వారి అపాయింట్మెంట్స్ పొందిన దరఖాస్తుదారులు పాస్పోర్ట్ సేవా పోర్టల్ www.passportindia.gov.in ద్వారా రీషెడ్యూల్ చేసుకోవడం ద్వారా వారి అపాయింట్మెంట్లను ముందస్తుగా మార్చుకోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ