విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 27 న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమ (ఆర్ఐఎన్ఎల్)లో భారత ప్రభుత్వ వాటాను 100% వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడానికి సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని కేంద్రపెట్టుబడి మరియు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం సెక్రెటరీ తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై విశాఖలో కార్మికుల ఆందోళన మొదలైంది. కేంద్రం వెంటనే ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే పలు పార్టీల నాయకులు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమవుతామని ప్రకటన చేస్తున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా?, లేదా అనే అంశంపై ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ