తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారని చెప్పారు. అలాగే శుక్రవారం మరో 15 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వడంతో ఇప్పటివరకు 32 మంది కోలుకున్నారని ప్రకటించారు. ప్రస్తుతం 186 మంది కరోనా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఢిల్లీలో మర్కజ్ సమావేశానికి హాజరైన వారందరిని గుర్తించడం జరిగిందని, వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణలో ఈరోజు మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.ఇప్పటి వరకు 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వైరస్ తో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు.ఈరోజు మరో 15 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 32 మంది కోలుకున్నారు.186 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు pic.twitter.com/6aiRJcAgPY
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 3, 2020