తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో భారత్ నుంచి 69 మంది ఎంపికవ్వగా, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు కూడా చోటు సంపాదించారు. మొత్తం 10 విభాగాల్లో 30 మంది చొప్పున 300 మందిని ఫోర్బ్స్ ఈ జాబితాకు ఎంపిక చేసింది. 3,500 కి పైగా నామినేషన్ల నుండి ఈ జాబితాను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఆర్ట్స్ & స్టైల్, ఫుడ్ & డ్రింక్, ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్, రిటైల్ & ఇ-కామర్స్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్&ఎనర్జీ,హెల్త్కేర్ & సైన్స్; సోషల్ ఎంట్రపెన్యూర్స్ &కన్జ్యూమర్ టెక్నాలజీ విభాగాల్లో వినూత్నంగా అలోచించి కొత్త తరహ వ్యాపారాలను అభివృద్ధి చేసి విజేతలుగా నిలిచిన యువతేజాలను ఫోర్బ్స్ ఎంపిక చేసింది.
ఈ జాబితాలో హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ (మారుత్ డ్రోన్స్), అశ్విన్ మోచర్ల (దీ థిక్ షేక్ ఫ్యాక్టరీ), సందీప్ బొమ్మి (యాడ్ ఆన్ మో), విహారి (అర్బన్ కిసాన్), పవన్ కుమార్ చందన (స్కై రూట్ ఏరోస్పేస్) చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వీరికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తూ టీ హబ్ ద్వారా పలు రకాల స్టార్టప్లకు చేయూతనిస్తున్న నేపథ్యంలో వీరు ఫోర్బ్స్ జాబితాకు ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Congratulations to 4 young Hyderabadis who’ve featured in 30 Under 30 Asia 2020 👍
Way to go guys 👏@Premkumar9 of Marut Drone@ashwinmocherla of The ThickShake Factory@TheSandeepBommi of AdonoMo
Vihari of @UrbanKisaan
https://t.co/YQAgUCk7fY— KTR (@KTRTRS) April 2, 2020