తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 46 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 8, మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,40,669కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 26, రంగారెడ్డిలో 3, మంచిర్యాలలో 3, కరీంనగర్ లో 3 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 8, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 3,79,81,899
- నవంబర్ 8న నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు : 6,071
- కొత్తగా నమోదైన కేసులు : 46
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,40,669
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 71
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 8,36,164
- కరోనా రికవరీ రేటు: 99.46%
- యాక్టీవ్ కేసులు : 394
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య : 4,111
- కరోనా మరణాల రేటు: 0.49%.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE