తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 848 కేసులు నమోదవడంతో జూలై 3, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 6 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3684 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 1114 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,09,947 కు చేరుకుంది. ప్రస్తుతం 12,454 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాడు 1,08,954 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,89,94,601 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 5,10,333 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ