రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ ను జూన్ 19 వరకు కొనసాగిస్తామని, అలాగే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పగటిపూట పూర్తిగా సడలింపు ఉండడంతో రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల్లో పాస్పోర్టు సేవలు కూడా నేటి నుంచి(జూన్ 10, గురువారం) పునఃప్రారంభం అయ్యాయి.
ముందుగా కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని 5 కీలక పాస్పోర్టు సేవా కేంద్రాలైన బేగంపేట్, అమీర్పేట్, టోలీచౌకీ, నిజామాబాద్, కరీంనగర్ లలో, మరియు 14 తపాలా కార్యాలయాల్లో పాస్పోర్టు సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా 5 ప్రధాన పాస్పోర్టు సేవ కేంద్రాల్లో జూన్ 1 నుంచే కార్యకలాపాలు ప్రారంభమవగా, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్నగర్, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి వంటి 14 తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలను నేటి నుంచి పునః ప్రారంభించారు. ఇకపై రాష్ట్రంలో అన్ని పాస్పోర్టు సేవా కేంద్రాలు సాధారణ సమయాల్లో పని చేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ