తెలంగాణ పదోతరగతి ఫలితాలు: 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటన

Telangana Tenth Class Results Released,Telangana SSC results 2021 Name wise,TS 10th Results Out 2021,Manabadi TS Telangana SSC Results 2021,TS SSC Results 2021 Declared,Manabadi TS 10th results 2021 OUT Today,Check SSC Results 2021 Telangana Board,TS SSC Results 2021,Mango News,Mango News Telugu,TS SSC Results 2021 Released,TS 10th Class Results Release Date 2021,TS SSC Result 2021 Live Updates,TS 10th Results 2021 Live,TS SSC Result 2021 Declared,TS Telangana SSC results 2021 for Class 10 declared,TS SSC Results 2021 Out,TS SSC Results 2021 Out Now,TS SSC Results 2021 Latest News,LIVE TS SSC Results 2021 Declared,Telangana 10th Results 2021,TS 10th Results 2021 Released,Telangana TS SSC Results 2021

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల వివరాలను www.bse.telangana.gov.in మరియు http.//results.BSETELANGANA.ORG వెబ్ సైట్ లలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు అందరిని ఉత్తీర్ణులను చేయడం జరిగిందని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది సీఎం కేసీఆర్ కు విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని చెప్పారు. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారని తెలిపారు. 2,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ. సాధించినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 535 పాఠశాలలు 10/10 జి.పి.ఎ సాధించాయని వెల్లడించారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్.ఎస్ .సి. బోర్డుకు పంపిన యెడల వెంటనే సరిదిద్దడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్ లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =