తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమలాపూర్లో టెన్త్ పేపర్ లీక్ కేసులో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరియు ఆయన పీఏకు వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఈటల రాజేందర్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ప్రశాంత్ అనే వ్యక్తి మొదట ఈటల రాజేందర్కు క్వశ్చన్ పేపర్ ను వాట్సప్ ద్వారా పంపించాడని, ఆ తరువాత దానిని బండి సంజయ్ కు కూడా పంపాడని పోలీసులు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యే ఈటలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్కు హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎంచుకోవడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE