మునుగోడులో కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Confidence on Congress Party Win in Munugodu Bypolls, Congress Party Win in Munugodu Bypolls, Munugodu Bypolls, Munugodu By Election, TPCC Chief Revanth Reddy, Telangana Congress party president Revanth Reddy, Munugode Assembly bypoll, Munugode Assembly, Revanth Reddy, Munugodu By Election News, Munugodu By Election Latest News And Updates, Munugodu By Election Live Updates, Mango News, Mango News Telugu,

మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని, ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. దీనిలో ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ బలాబలాపై చర్చించారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, దామోదర్ రెడ్డి, బోసు రాజు తదితరులు హాజరయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌, బీజేపీ విధానాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లది పక్కా అవకాశవాద రాజకీయమని, నాడు ప్రధాని నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్‌లు హైదరాబాద్‌ను భారత దేశంలో విలీనం చేసినప్పుడు అసలు ఈ పార్టీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని ఆయన గుర్తు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ బలమెంత ఉందో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయంగా ఎంతో చేసిందని, కానీ ఆయన మాత్రం తన స్వార్ధం కోసం కాంగ్రెస్‌కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు భవిష్యత్ తెలంగాణకు దిక్సూచి కావాలని రేవంత్ రెడ్డి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =