పోతిరెడ్డిపాడుపై ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం నుంచి 2 టీఎంసీల ఎత్తిపోతకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి ఈ పథకం చేపట్టారని అన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వ తీరుతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని అన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu