తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందుగా సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఈ రోజు ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద మోహరించి, గృహనిర్బంధం చేశారు.
అనంతరం కార్యకర్తలతో కలిసి ఎర్రవెల్లి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు. కాగా పోలీసులు అరెస్ట్ చేసినా ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ