ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటుగా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా చేపట్టాల్సి చర్యలపై కీలకంగా చర్చిస్తునట్టు తెలుస్తుంది. ఏపీలో ఇప్పటికే 6 ఒమిక్రాన్ కేసుల నమోదు అయ్యాయి. దీంతో ఒమిక్రాన్ కట్టడి, మూడో వేవ్ సన్నద్ధతపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ చర్చించి కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ