టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేడు (సెప్టెంబర్ 3, శనివారం) సాయంత్రం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష/టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు” నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నిక అంశం, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY