తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడుతున్న ఒక్కొక్క అంశం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనిపై టీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారితే తనకు రూ.100 కోట్లు, తనతోపాటు వచ్చేవారికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనిలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి (ఏ1), హైదరాబాద్ కు చెందిన నందకిశోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ఈ మొత్తం వ్యవహారానికి నందకిశోర్ మధ్యవర్తిత్వం వహించారని, తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తం అందిస్తామని ప్రలోభపెట్టడానికి రామచంద్ర భారతి మరియు సింహయాజిలు ప్రయత్నించారని తెలిపారు. బీజేపీలో చేరితే తమకు కోట్ల రూపాయలు ఇస్తామని, బీజేపీ తరపున వారు హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ మారకపోతే తమపై సీబీఐ మరియు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తామని, వివిధ కేసులు నమోదు చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించారు. అలాగే బీజేపీలో చేరితే కేంద్రప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని, దీంతోపాటు సెంట్రల్ స్థాయిలో సివిల్ కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మొయినాబాద్ పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY