తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన అనంతరం అవకాశం దక్కని నేతలు ఒక్కొక్కరిగా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ డి.అరవింద్ ను ఆయన నివాసంలో కలవడం, ఈ భేటీకి సంబంధించిన ఫోటో ను ఎంపీ అరవింద్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో షకీల్ బీజేపీ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న షకీల్ బీజేపీలో చేరుతున్నారని ఒక్కసారిగా ప్రచారం జరగడంతో ఆయన గురువారం రాత్రి వివరణ ఇచ్చారు.
గురువారం రాత్రి ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో షకీల్ సమావేశమయ్యి జరిగిన పరిణామాలపై ఆయనకు వివరణ ఇచ్చారు. అనంతరం షకీల్ మీడియాతో మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస ను వీడేది లేదని స్పష్టం చేసారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కేసీఆర్ తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇచ్చారని, రెండు సార్లు ఆయన ఆశీర్వాదంతోనే గెలిచానని చెప్పారు. కేసీఆర్ తనకు పొలిటికల్ గాడ్ ఫాదర్ అని, మంత్రి పదవి కావాలని ఆయన్ను ఎప్పుడూ అడగలేదని షకీల్ చెప్పారు. కేంద్రప్రభుత్వం బోధన్ కు మంజూరు చేసిన రూరల్ అర్బన్ స్కీం ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే నిజామాబాద్ ఎంపీ డి.అరవింద్ ను కలిసినట్టు పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=sn6siFkPMdY]