తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అధికార టిఆర్ఎస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్, బీజేపీ, టిజెఎస్ ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలుపుకు ప్రణాళికలు రచిస్తూ, నామినేషన్ ప్రక్రియకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. “కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదు. పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే జనసేన కార్యకర్తలకు పార్టీ తరఫున మద్దతు ఉంటుందని” జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
[subscribe]