తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనివెనుక బీజేపీ ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్పై మండిపడుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని, దీనిలో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు దీనిపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని, అలాగే కోర్ట్ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేయించాలని కోరారు. మరోవైపు శుక్రవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎదుట ప్రమాణం కూడా చేశారు.
ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరో అడుగు ముందుకేశారు. శుక్రవారం ఆయన ఈడీ ఆఫీసుకి వెళ్లారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగుచూసిన ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవాలని రఘునందన్ రావు కోరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారని, దీనికి సంబంధించి ఆ డబ్బుపై లెక్క తేల్చాలని ఈడీ అధికారులని కోరినట్లు సమాచారం. అసలు ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని, అది ఎవరికి సంబంధించినదనేది విచారణ చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY