నాకు ఎలాంటి నోటీసులు అందలేదు, స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kalvakuntla Kavitha Clarifies That She Did Not Receive Any ED Notice, TRS MLC Kalvakuntla Kavitha, MLC Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha on ED Notice, Kalvakuntla Kavitha Latest News And Updates, Mango News, Mango News Telugu, TRS MLC Kavitha, TRS MLC Kavitha Delhi Liqour Scam Case, Delhi Liquor Scam, Delhi Liquor Scam ED Rides, Delhi Liquor Scam Ed Raids In Telangana, Ed Raids In Telangana, Enforcement Directorate Hyd, Enforcement Directorate ,

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసుల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టత ఇచ్చారు. త‌న‌కు ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్ప‌ష్టం చేశారు. “ఢిల్లీలో కూర్చొని కొంతమంది చేస్తున్న దురుద్దేశపూరిత ప్రచారం మీడియాను తప్పుదోవ పట్టిస్తోంది. మీ సమయాన్ని నిజాన్ని చూపించడానికి ఉపయోగించమని అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నాను. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని, దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని ఎమ్మెల్సీ కవిత గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో హైదరాబాద్ లో పలువురు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా శుక్రవారం ఈ అంశంపై ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చారనే ప్రచారం ప్రారంభమైంది. దీంతో ఆమె వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, తనకు ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =