ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు భూమి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్

Chief Minister of Telangana, CM KCR, CM KCR Lay Foundation Stone For TRS Party Office In Delhi, CM KCR Lays Foundation Stone for TRS Party Office in New Delhi, Foundation stone of TRS office in Delhi, KCR lay foundation stone for TRS office in Delhi, KCR lay foundation stone for TRS party office in Delhi, KCR Lays Foundation Stone for TRS Party Office in New Delhi, Mango News, Telangana CM, Telangana CM KCR, Telangana CM KCR Lay Foundation Stone Of TRS Office In Delhi, Telangana CM KCR To Lay Foundation Stone Of TRS Office, Telangana CM KCR To Lay Foundation Stone Of TRS Office In Delhi, Telangana Rashtra Samithi, TRS Bhavan in the National Capital, TRS Office In Delhi, TRS Party President

టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సమయంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ (టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్) నిర్మాణానికి పార్టీ శ్రీకారం చుట్టింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలంలో నేడు శంకుస్థాప‌న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పండితుల వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నుంచి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటున్న తొలి పార్టీగా టీఆర్ఎస్ నిలవనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + sixteen =