తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన సభను తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయగర్జన సభ నవంబర్ 29కు వాయిదా పడింది. తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన విజయగర్జన సభ నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు వరంగల్ లో సమావేశం నిర్వహించి దీక్షా దివస్ రోజైన నవంబర్ 29 తేదీనే తెలంగాణ విజయగర్జన సభ నిర్వహణకు సరైన సందర్భమని భావిస్తూ, సభను ఆ తేదీన నిర్వహించాలని సీఎం కేసీఆర్ కు అభ్యర్ధన చేశారు. పార్టీ నేతల అభ్యర్థనకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి విజయగర్జన సభ నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో జరిపేందుకు టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ