హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “హుజూరాబాద్ లో ఉపఎన్నిక కోసం కష్టపడి పనిచేసిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మరియు కేడర్ అందరికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే ప్రచారంలో అలుపెరగని సోషల్ మీడియా యోధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసింది మరియు ఈ ఒక్క ఎన్నికల ఫలితం పెద్దగా ప్రాముఖ్యత లేదా పర్యవసానంగా ఉండదు. ఈ ఎన్నికలో స్ఫూర్తిదాయకంగా పోరాడిన పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అభినందనలు. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ భవిష్యత్ పోరాటాల్లో ముందుకు సాగేందుకు మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ