జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన మంత్రి కేటిఆర్

TRS Working President KTR Started GHMC Election Campaign

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ ఈ రోజు సాయంత్రం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ముందుగా నగరంలోని ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో రోడ్‌షోతో మంత్రి కేటిఆర్ తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి కేటిఆర్ కు ఘనస్వాగతం పలికారు.

అనంతరం మూసాపేట్‌ చిత్తారమ్మ తల్లి చౌరస్తా లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరేళ్లుగా పటిష్టమైన శాంతి భద్రతలతో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని, హైదరాబాద్ నగరం అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షో తర్వాత కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గంలోని ఐడీపీఎల్‌ చౌరస్తా, సాగర్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద మంత్రి కేటిఆర్ రోడ్ షో లు నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో కేటిఆర్ తో పాటుగా ఎలక్షన్ ఇంచార్జులుగా ఉన్న మంత్రులు, స్థానిక నాయకులు పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =