తమిళనాడులోని కడలూరు జిల్లాలోని కాట్టుమన్నూర్ కోయిల్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఆప్రాంతంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు కడలూరు పోలీసులు వెల్లడించారు. అలాగే మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu