తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్కు సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. నేటినుంచి ఈనెల 12వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అధికారిక కౌన్సెలింగ్ వెబ్సైట్ tsicet.nic.in లో సంబంధిత వివరాలు పొందుపరచాలని పేర్కొంది. అయితే, అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా టీఎస్ ఐసెట్ హెల్ప్లైన్ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనుండగా, అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక అక్టోబర్ 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు తొలి విడుత సీట్లు కేటాయించనున్న అధికారులు, ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 18-21వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. ఇక ఐసెట్ తుదివిడుత కౌన్సెలింగ్ అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 28వ తేదీన తుది విడుత సీట్లను కేటాయించనున్నారు. అక్టోబర్ 28-30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఇక నవంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కాగా కౌన్సెలింగ్ షెడ్యూల్, ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు మరియు మరిన్నింటితో సహా మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఇక కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఆప్షన్ ఎంట్రీ, తర్వాత సీటు కేటాయింపు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ జాబితాలో తమ పేర్లను చేర్చుకోవడానికి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా టీఎస్ ఐసెట్ కటాఫ్ స్కోర్ను కలిగి ఉండాలి. కాగా టీఎస్ ఐసెట్ సీట్ల కేటాయింపు జాబితా.. అభ్యర్థి ర్యాంక్, ఎంచుకున్న ఎంపికలు, రిజర్వేషన్ ప్రమాణాలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తయారు చేయబడుతుందన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY