తెలంగాణలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించనున్న టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షలు రేపు జరుగనున్నాయి. ఈ మేరకు ఈ పరీక్షలను మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్ లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. దీని ప్రకారం.. మూడేళ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా తొలి రెండు సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మూడో సెషన్కు మాత్రం తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ పరీక్షలకు మొత్తం 43,692 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేళ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది రాయనుండగా.. ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్షల సెషన్ల సమయం ఇదే..
మూడేళ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు పరీక్ష సమయం
- మొదటి సెషన్ – రేపు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు.
- రెండో సెషన్ – రేపు మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు.
ఐదేళ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు పరీక్ష సమయం
- మూడో సెషన్ – రేపు సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE