తెలంగాణ రాష్ట్రంలో గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2022-23 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్ఆర్జేసీ సెట్-2022” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు మే-2022లో పదో తరగతికి హాజరవుతున్న విద్యార్థులు ఆన్లైన్లో (https://tsrjdc.cgg.gov.in/) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని గతంలో ఏప్రిల్ 11గా నిర్ణయించారు. అయితే తల్లితండ్రుల నుంచి విజ్ఞప్తులు, విద్యార్థుల సౌకర్యార్ధం తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టుగా తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తునట్టు చెప్పారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ-ఇంగ్లీషు మీడియం) ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అలాగే ఈ టీఎస్ఆర్జేసీ పరీక్షను మే 22వ తేదీన నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ