కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి నిచ్చారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ వలన ఏర్పడ్డ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సహాయపడాలని బార్ మరియు రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నేపథ్యంలో మే 10 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఏంఆర్పీ ధరలకు మద్యం అమ్మెందుకు బార్లు, పబ్ లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మద్యం కొనుగోలుకు(టేక్ ఎవే) మాత్రమే అనుమతి ఉందని, లోపల సిట్టింగ్ కు అనుమతులు లేవని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu