తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శనివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, నగర విస్తీర్ణం దృష్ట్యా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు ఉన్న రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కారిడార్తో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రవాణా సమయం కలిసి వస్తుందని, ఈ మేరకు తాము గతంలోనే రక్షణ శాఖను కోరామని లేఖలో పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం రక్షణ శాఖ భూములను కేటాయించాలని అభ్యర్థించారు. ఇక కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్స్ ఉన్నాయని, ఆ మేరకు కంటోన్మెంట్ను రాష్ట్రానికి అప్పగిస్తే జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు.
My letter to the Union Minister for Defence, Sri @rajnathsingh Ji, Requesting to allot defence lands in the cantonment for expansion of the arterial roads leading to Rajiv Rahadaari and construction of an elevated corridor from Parade grounds to Shamirpet. pic.twitter.com/tiIPJ4MmLd
— B Vinod Kumar (@vinodboianpalli) February 25, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE