తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత బుధవారం నాడు ఓ ఐపీఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా తేలగా, తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్లకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఈ అధికారుల వద్ద పని చేస్తున్న గన్మెన్లు, ఇతర సంబంధిత సిబ్బందిని కూడా క్వారంటైన్కు తరలించినట్టు సమాచారం. ఇక ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 20 కరోనా కేసులు, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాలకి కరోనా పాజిటివ్ గా తేలడంతో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డ్రైవర్తో పాటుగా గన్మెన్కు కూడా కరోనా సోకినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu