కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేటి నుంచి రెండ్రోజుల పాటుగా (సెప్టెంబర్ 1, 2 తేదీల్లో) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఉండనుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ పర్యటనల్లో భాగంగా నియోజవర్గ పరిధిలోని ఆల్ బీజేపీ మోర్చాలు, జిల్లా ఆఫీస్ బేరర్లు, మండల ప్రెసిడెంట్స్, ఐటీ, సోషల్ మీడియా వాలంటీర్లతో కేంద్రమంత్రులు సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగంపై కేంద్రమంత్రులు వివరించనున్నట్టు తెలుస్తుంది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటన షెడ్యూల్:
సెప్టెంబర్ 1:
- సాయంత్రం 5 గంటలకు కామారెడ్డి సత్య కన్వెన్షన్ సెంటర్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని జిల్లా ఆఫీస్ బేరర్లు, మండల ప్రెసిడెంట్స్ తో సమావేశం
- రాత్రి 7.15 గంటలకు కామారెడ్డిలో గణేష్ మండపం సందర్శన
సెప్టెంబర్ 2:
- ఉదయం 10 గంటలకు బిర్కూన్ టౌన్ లో రేషన్ షాప్ సందర్శన
- ఉదయం 10.45 గంటలకు బాన్సవాడాలోని కోటగిరి పీహెఛ్సీలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శన
- మధ్యాహ్నం 2 గంటలకు రుద్రూర్ లోని శశిరేఖ గార్డెన్స్ లో ఆల్ బీజేపీ మోర్చాలతో సమావేశం
- సాయంత్రం 4.30 గంటలకు రుద్రూర్ లోని శశిరేఖ గార్డెన్స్ లో ఐటీ, సోషల్ మీడియా వాలంటీర్లతో సమావేశం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY