వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేటి నుంచి ఇవి అమలులో ఉంటాయని కమిషనర్ వెల్లడించారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రేపు హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టులో విజ్ఞప్తి చేయడం, దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పాదయాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తూ బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY