ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన ‘ఆప్’ సర్కార్‌.. ప్ర‌లోభాలకు తమ ఎమ్మెల్యేలు లొంగలేదన్న సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwals AAP Govt Proves Majority in Delhi Assembly During Trust Vote Today, Arvind Kejriwal Proves Majority, Arvind Kejriwal Wins Trust Vote Assembly, Arvind Kejriwal On Majority Test, Mango News, Mango New Telugu, Delhi Assembly Session, Delhi CM Arvind Kejriwal, Arvind Kejriwals Latest News And Updates, AAP, Aam Admi Party, Delhi Assembly Session Live Updates

ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స‌ర్కార్ విజ‌యం సాధించింది. ఈ మేరకు గురువారం నిర్వహించిన విశ్వాస ప‌రీక్ష‌లో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ స‌ర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. కాగా మొత్తం 70 మంది స‌భ్యులు క‌లిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఓటింగ్‌లో 58 మందే పాల్గొన్నారు. విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన అనంత‌రం సీఎం కేజ్రీవాల్ ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ లోటస్‌ ఢిల్లీలో విఫలమవుతుందని తేల్చి చెప్పేందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టానని పేర్కొన్నారు. ఆప్ స‌ర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించిందని, అయితే ఇతర రాష్ట్రాల్లో సాగినట్లు వారి ఆటలు ఢిల్లీలో సాగలేదని తెలిపారు.

ఆప్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ కొనలేకపోయిందని, తమ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోలేదని ప్రకటించారు. ఇక త‌మ పార్టీకి మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేసిన కేజ్రీవాల్.. వీరిలో ఇద్ద‌రు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నార‌ని, ఒక ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్‌ జైల్లో ఉన్నాడని, ఇక మ‌రో స‌భ్యుడు శాస‌న‌స‌భ స్పీక‌ర్ స్థానంలో ఉన్నారని వివరణనిచ్చారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికతో వారికే ఎదురుదెబ్బ తగలనుందని పేర్కొన్నారు. మనీశ్‌ సిసోడియాపై దాడులు జరిగిన తర్వాత ఢిల్లీలో కాదు, ఏకంగా గుజరాత్‌లో ఆప్ ఓటు షేర్‌ 4 శాతం పెరిగిందని, ఇక ఆయన అరెస్ట్‌ అయితే అది 6 శాతానికి చేరుతుందని అన్నారు.

ఇక ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకల ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై సిబీఐ, ఈడీ దాడులను ప్రస్తావిస్తూ ఇది తమకు మంచి చేసిందని వ్యాఖ్యానించారు. కాగా ఆప్‌ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు చొప్పున అందజేస్తామని తమ సభ్యులకు ఆఫర్ వచ్చిందని గత వారంలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవలి మహారాష్ట్ర, తాజాగా జార్ఖండ్ రాష్ట్రాల అనుభవంతో అప్రమత్తమైన కేజ్రీవాల్ బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టడానికై సొంత ప్రభుత్వం పైనే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఓటింగ్ జరుగగా, హాజరైన అందురు ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయడంతో విజయం సాధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =