ఈ ఏడాది తొలిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు రాజ్నాథ్ సింగ్ ఈనెల 16న హైదరాబాద్కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు.. టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారని బిజెపి వర్గాల సమాచారం. సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు, చాలా మంది బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే పరామర్శించారు. ఇదేక్రమంలో హీరో ప్రభాస్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా గత పర్యటన సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY