బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 11 తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఫిబ్రవరి 11న ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అమిత్ షా పర్యటించనున్నట్టు తెలుస్తుంది. గత ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఫిబ్రవరి నెలాఖరున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. ఇక ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెలలో వరుసగా బీజేపీ అగ్రనేతల రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉండడంతో తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ నెలకుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరపనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE