జీహెచ్ఎంసీ ఫలితాల అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీకి పంపించారు. గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపలేక కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకుని టీపీసీసీకి వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కోరినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ