నార్త్ సిక్కింలోని జైమా వద్ద విధి నిర్వహణలో వున్న భారత ఆర్మీ జవాన్లు, అధికారులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ జవాన్లు, అధికారుల కుటుంబాలకు సీఎం తన సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగు విధంగా వైద్యసేవలందించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE