దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి విమాన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కేంద్రం సూచనల అనుగుణంగా ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది.
ఏపీకి వచ్చే విమాన ప్రయాణికులు పాటించాల్సిన గైడ్ లైన్స్:
- రాష్ట్రానికి రావాలనుకునే విమాన ప్రయాణికులు సమాచారాన్ని ప్రభుత్వ స్పందన వెబ్సైట్లో పొందుపరచాలి.
- స్పందన వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే వారికీ రాష్ట్రంలోకి వచ్చేలా ఎయిర్లైన్స్ టికెట్లు అమ్మాలి.
- రాష్ట్రానికి చేరుకున్నాక లక్షణాలున్న వారిని పరీక్షించి 7 రోజులు క్వారంటైన్లో ఉంచుతారు. తర్వాత నెగిటివ్ వస్తే మరో 7 రోజులు హోం క్వారంటైన్ నిబంధన పాటించాలి.
- ప్రస్తుతం దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న చెన్నై, ముంబయి, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చేవారిని క్వారంటైన్ సెంటర్లకు పంపేలా ప్రభుత్వం ఆదేశాలు.
- ఇవికాక ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులు హోం క్వారంటైన్ నిబంధన అనుసరించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu