డిసెంబర్ 3న వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే ఉందని ముందు నుంచీ అంతా అనుకున్నట్లే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే పోలింగ్ తర్వాత, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల తర్వాత కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని తేలిపోయింది. దీనికి కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ను నమ్మడానికి లేదని.. గత ఎన్నికల్లో కూడా ఇలాగే చెప్పాయని ..తాము రెండోసారి కూడా అధికారంలోకి వచ్చామని మరోసారి గుర్తు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ కు కూడా ఛాన్స్ ఉన్నట్లుగా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకటించాయి. అలాగే బీజేపీ కూడా 15 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్ల కొన్ని సర్వేల ద్వారా వెల్లడయ్యింది.
ఇదిలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీచినట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగనున్నట్లు ప్రకటించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాని పోటీ ఉంటుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్..కరీంనగర్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పట్టు సాధించబోతున్నట్లుగా చెబుతున్నాయి. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదన్నట్లుగా పోల్స్ చెబుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోతున్నాయి .
ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండి సంజయ్కు ఇది నిజంగా షాక్ కొట్టే విషయమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ 6 నుంచి 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 5 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అటు 13 స్థానాలలో బీ ఆర్ ఎస్ రెండు స్థానాలలో.. కాంగ్రెస్ 11 స్థానాలు విజయం సాధిస్తుందని పాయింట్ అవుట్ సంస్థ పేర్కొంది. బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోదని విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.
ఉమ్మడి కరీంనగర్లో బీజేపీకి అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేయడంతో బండి సంజయ్ వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హోదాలో దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే బండి సంజయ్ను హఠాత్తుగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు . అప్పటి నుంచే బండి సైలెంట్ అయ్యారు. అయితే బీజేపీ నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి తానేనని గంపెడాశలు పెట్టుకున్న బండి సంజయ్కు ఇప్పుడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టెన్షన్లో పడేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే రేపు కౌంటింగ్ సమయంలోనూ వెలువడితే తన పరిస్థితి ఏంటనే అందోళన మొధలయింది. ఇప్పటికే హై కమాండ్తో పాటు జనాల్లోనూ తన గ్రాఫ్ తగ్గిందని మదన పడుతున్న బండి సంజయ్కు రేపు ఎలాంటి ఫలితాలు వస్తాయో అని టెన్షన్ మొదలయింది. ఇదే జరిగితే తన గ్రాఫ్ మరింత తగ్గే అవకాశం ఉందని బండి మదనపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE