వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక హత్య ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా మహిళా కమిషన్ కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు సోమవారం నాడు మహిళా కమిషన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 15 సంవత్సరాల మైనర్ బాలికను హత్య చేయడం దారుణమని, మనుషుల్లో మానవత్వం లోపించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో నిందితులను గుర్తించి శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దుండగుల బారినుండి రక్షించబడాలంటే బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్దతులు పాటించి ప్రాథమిక రక్షణ పొందాలని ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ