ప్రపంచ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని తెలంగాణ పోలీస్ షీ-టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించగా, ప్రత్యేక ఆహ్వానితులుగా డీజీపీ అంజనీ కుమార్, సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ లు హాజరయ్యారు. మహిళా భద్రతా, షీ-టీమ్ లపై చైతన్యం, తదితర అంశాలపై చైతనానికి ఉద్దేశించి 2-కే, 5-కే రన్ లను హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. ఈ రన్ లకు నగరంలోని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE