తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదాయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఆలయానికి నిన్న ఒక్క రోజులోనే రూ. 1 కోటికి పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ఒకవైపు కార్తీక మాసం కావడం, మరోవైపు ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారని, దీంతో నిన్న ఒక్కరోజే దేవస్థానానికి రూ.1,09,82,446 ఆదాయం వచ్చిందని ఆమె వెల్లడించారు. కాగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం జరిగినప్పటి నుంచి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదని కూడా ఆమె స్పష్టం చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని, అదే శని, ఆదివారాల్లో అయితే భక్తుల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుందని ఈవో గీత పేర్కొన్నారు. వివిధ సేవలు, కౌంటర్ల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఆమె వెల్లడించారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టికెట్ల ద్వారా రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000, ఇంకా పలు రకాల సేవల ద్వారా మొత్తం ఆదాయం రూ.1,09,82,446 వచ్చిందని ఈవో గీత వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE