తెలంగాణ సీఎం కేసీఆర్ను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుత రీతిలో నిర్మాణం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ఆమె శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈక్రమంలో.. రోజా అక్కడి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ఎవరికి దక్కనటువంటి అద్భుత అవకాశం సీఎం కేసీఆర్ కు లభించిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షించే విధంగా ఆలయ నిర్మాణం చేశారని ఆమె అన్నారు. కాగా, యాదాద్రి ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుంచి తీసుకు వచ్చారని ఆమె తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు ఎప్పటికీ అన్నదముళ్లు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ