తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ముందుగా సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకొని, వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించారు. ఈ ప్రెసిడెన్షియల్ సూట్ను 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. అనంతరం భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, అధికారులు పాల్గొన్నారు.
ఇక మధ్యాహ్నం భువనగిరిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఈ సాయంత్రం రాయగిరిలో జరగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ