పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

Lotus Pond, Mango News, YS Sharmila, YS Sharmila About Rajanna Rajyam, YS Sharmila at Lotus Pond in Hyderabad, YS Sharmila Meeting, YS Sharmila Meeting in Hyderabad, YS Sharmila Meeting Updates, YS Sharmila Meeting with Khammam District Leaders, YS Sharmila Meeting with Khammam District Leaders at Lotus Pond, YS Sharmila New Party, YS Sharmila New Political Party Announcement, YS Sharmila Party

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాల నేతలతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో ఖమ్మం వేదికగా పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు షర్మిల వెల్లడించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు సహా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఖమ్మం జిల్లా నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు.

అలాగే దివంగత నేత వైఎస్ఆర్ 5 సంవత్సరాలపాటుగా ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన ఎన్నో గొప్ప సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక, నిజాన్ని జీర్ణించుకోలేక ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడ జరగని విధంగా దాదాపు 700 మంది చనిపోయారని చెప్పారు. వాళ్ళల్లో తెలంగాణ ప్రజలే ఎక్కువ శాతం మంది ఉన్నారని, ఎందుకంటే వైఎస్ఆర్ పథకాల వలన లబ్ధిపొందిన వారిలో తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + five =