వైఎస్ షర్మిల బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతూ మేడారంలో ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. మధ్యాహ్నం హుజూర్నగర్ సర్కిల్ లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించనున్నారు. అనంతరం కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్ఆర్ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి బయల్దేరనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ