వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని ఆమె పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడుల ఘటనలు పెరుగుతున్నాయని వైఎస్ షర్మిల అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ